![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2020/12/rajani-Makkal-Sakthi-Kazhag.jpg?resize=800%2C507&ssl=1)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద షాక్ ఇచ్చాడు. మరో రెండు రోజుల్లో పార్టీ ప్రకటన చేయబోతున్నారని అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్న క్రమంలో పార్టీ ప్రారంభిచలేనంటూ మూడు పేజీల సుదీర్ఘ లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేసి షాక్ ఇచ్చారు.
అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని .. తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను కోరారు. రాజకీయ ప్రకటనకు ముందు ఆసుపత్రిలో తాను చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్టు లేఖలో తెలిపారు. తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా.. కానీ ఇప్పుడు కాదు అని తేల్చిచెప్పారు. తాజాగా రజనీకాంత్ అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. ‘అన్నాత్తే’ షూటింగ్ కోసం రజని రోజుకు 14 గంటలు రెస్ట్ లేకుండా పనిచేసారు. దీంతో ఆయన ఆనారోగ్యం బారిన పడ్డారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజనీ.. నేరుగా చెన్నై చేరారు. అయితే ఆయన అనారోగ్యం నుంచి కోలుకున్నప్పటికీ కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇదిలా ఉంటే.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పలువురు రాజకీయాలపై ఆయన వెనక్కి లాగినట్టు తెలుస్తోంది.