![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2021/01/Prabhas-Give-The-Wrist-Watches-To-Radhe-Shyam-Team-Unit.jpg?resize=700%2C420&ssl=1)
బాహుబలి సినిమా తో తన లైఫ్ స్టయిల్ గ్రాఫ్ ఛేంజ్ అయిన ప్రభాస్. పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రభాస్ తో సినిమా చెయ్యడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పీరియాడికల్ నేపథ్యం కలిగిన ఈ చిత్రం యోక్క్ షూటింగ్ ఎక్కువ భాగం ఇటలీలో జరుకుంది.
ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ రాధే శ్యామ్ యూనిట్ మొత్తం కు సర్ప్రైజ్ గిఫ్ట్ లు ఇచ్చాడంట. అవి చూసిన చిత్రా యూనిట్ సంతోషంతో మురిసి పోతూ మనిషి మాత్రమే ఆజానుబావుడు కాదు మనసు కూడా ఎంతో ఉన్నతమైందని ఇతరులతో చర్చిచుకుంటున్నారంట. ఇంతకు ఏమై ఉంటుంది అనుకుంటున్నారా ఖరీదైన రిస్ట్ వాచ్ లను రాధే శ్యామ్ యూనిట్ కు బహుమతిగా ఇచ్చాడంట.
ఈ చిత్రంను యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ,ప్రమోద్ ప్రశీద లు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం సమ్మర్ లో విడుదల కానున్నది. ఈ చిత్రం తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో నటించనున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కనున్నది. సంక్రాంతి రోజున పూజ కార్యక్రమాలతో ఘనంగ ప్రారంభించారు. ఈ చిత్రం సెట్స్ పైన ఉండగానే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ఓ చిత్రం సెట్స్ పైకి వెల్లుతుంది. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో అధిపురుష్ చిత్రంలో నటించనున్నాడు. ప్రభాస్ ఈ చిత్రంలో రాముడిగా కనిపిస్తాడు. రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించనున్నాడు.