![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/03/Mithra-sharma-over-action-in-telugu-bigg-boss.jpg?resize=800%2C500&ssl=1)
తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో ఛాలెంజర్స్ మరియు వారియర్స్ మధ్య పోటీ గట్టిగానే నడుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ ఛాలెంజర్స్ ఆధీనంలో ఉంది. భోజనం చేయావన్నా, స్నానం చేయలన్నా, చివరకు పడుకోవాలన్నా కూడా ఛాలెంజర్స్ పరిమిషన్ కావాల్సిందే. అయితే ఓ వైపు ఛాలెంజర్స్ రూల్స్ ను పాటిస్తూనే మరో వైపు టాస్కులను ముందుకు తీసుకెళ్తున్నారు.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/03/Mithra-sharma-over-action-in-telugu-bigg-boss-1.jpg?resize=1024%2C576&ssl=1)
ఈ క్రమంలోనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందుకు ఛాలెంజర్స్ టీంలో చైతూని లీడర్ గా పెట్టారు. వారియర్స్ టీంలో నటరాజ్ మాస్టర్ ని టీం లీడర్ గా ఉంచారు. అంతే కాదు బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో ఇరు టీమ్స్ ఒకరినొకరు దమ్ముంటే చేసి చూపించూ అంటూ ఛాలెంజ్ విసిరిపిస్తూ ఆట ఆడిపిస్తున్నారు.
అందుకోసం టాస్కులను బట్టి బిడ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఎవరి కెపాసిటీ, దమ్ము ఎంతో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టాస్కులో భాగంగా స్విమ్మింగ్ పూల్ లో చేపలా ఊపిరి పీల్చాల్సి ఉంటుంది. అయితే ఇందులో పాల్గొనేందుకు ఛాలెంజర్స్ టీం నుంచి మిత్రా శర్మ రాగా వారియర్స్ టీం నుంచి అఖిల్ ను ఎంపిక చేశారు. అయితే అఖిల్ 30 సెకన్ల బిడ్ వేయగా… మిత్రా శర్మ 5 నిమిషాలు చెప్పేసింది.
ఇందుకు షాక్ అయిన అఖిల్ దమ్ముంటే చెయ్ అంటూ ఛాలెంజ్ విసిరాడు. పూల్ లోకి దిగిన మిత్రా శర్మ కాసేపు కూడా ఉండలేక బయటకు వచ్చేసింది. అత్యుత్సాహంతో వెళ్లి ఓడిపోయింది. అవగాహన లేకుండా చేసిన ఓవర్ యాక్షన్ వల్లే ఛాలెంజర్స్ టీం ఓడిపోయింది. ప్రస్తుతం సీనియర్స్ జట్టు ముందంజలో ఉంది.